అమ్మ తోడు ఇక అలా చేయను

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ అర్ధరాత్రి దాటిన తర్వాత దేవుళ్లపై, స్టార్‌ హీరోలపై వివాదాస్పద ట్వీట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఆ మధ్య మెగా హీరోలపై ఆయన చేసిన ట్వీట్లు ఎంతో సంచలనం సృష్టించాయి. అయితే వర్మ ఇకపై అలాంటి పనులు చేయడట. తను పూర్తిగా మారిపోయాడట. ఇకపై ఎవరినీ కించపరిచేలా ట్వీట్లు చేయనని తనే స్వయంగా చెప్పాడు. వర్మ చెప్తూ..  "నా వ్యాఖ్యాలతో బాధపడ్డ  మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నాకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు. అందుకే మా అమ్మ మీద, అమితాబ్‌ బచ్చన్‌ మీద ఒట్టేసి చెబుతున్నాన" అని ట్వీట్‌ చేశాడు. అయితే తను ఇంతగా మారడానికి కారణం చెప్తూ బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమాల్‌ వల్లే తాను మారుతున్నట్టు చెప్పాడు. కాగా, వర్మ గతంలో కూడా మెగాహీరోల గురించి ఇకపై ట్వీట్లు చేయను అని చెప్పి, ఆ తర్వాత వారిపై ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి మళ్లి ఏ సంచలనం చేస్తాడో వర్మ.

Comments