యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి చిత్రం తర్వాత స్టార్డమ్ ఏ రేంజ్లో పెరిగిందో ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. ప్రభాస్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో దానికి డబుల్ క్రేజ్ను బాహుబలితో నేషనల్ స్టార్డం సంపాదించుకున్నాడు. ప్రభాస్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ క్రేజ్ కి బాలీవుడ్లో ఓ భామ పడిపోయిందట. ఆమె ఎవరో కాదు.. కియారా అద్వానీ. ఈ అమ్మడు ప్రభాస్కు ఓ సీక్రెట్ మెసేజ్ పెట్టిందట. గతంలో ప్రభాస్ను కలవడానికి ప్రయత్నించిన ఈ భామకు నిరాశే ఎదురైందట. అందుకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరో ద్వారా ప్రభాస్ నంబర్ సంపాదించి అతడికి మెసేజ్ పెట్టేసిందట. ఆ మెసేజ్కు మాత్రం ప్రభాస్ రిప్లై ఇచ్చాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పక్కన హీరోయిన్గా చాన్స్ కొట్టేయడానికి ఇప్పటి నుంచే అతడిని ఆమె లైన్లో పెట్టేస్తోందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Comments
Post a Comment