సూపర్ స్టార్ రజనీకాంత్
కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సంచలన విజయం సాధించిన విషయం
తెలిసింది. అయితే ఆ చిత్రానికి కొనసాగింపుగా రోబో ‘2.0’ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్
కుమార్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ చిత్ర పరిశ్రమలో అక్షయ్
నటిస్తున్న తొలి చిత్రమిది కావడం విశేషం. 400 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుకుంటుంది. అయితే ఈ చిత్రం కోసం అక్షయ్
కుమార్ రోజుకు 2 కోట్లు పారితోషికం తీసుకుంటునట్లు
సమాచారం. ఈ చిత్రం కోసం అక్షయ్ ప్రతిరోజు చాలా మేకప్ వేసుకోవాల్సి వచ్చిందట. తన 25 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు మేకప్
వేసుకోలేదని చెప్పుకొచ్చాడు అక్షయ్. ఇందులో అక్షయ్ దాదాపు 12 పాత్రల్లో కనిపిస్తాడని సినీ వర్గాల టాక్. ఈ చిత్రంలో అమీజాక్సన్ కథానాయిక కాగా
ఎ.ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల
ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం..
Comments
Post a Comment